తెలంగాణ
సిరిసిల్లలో లాఠీచార్జి: 17 మందికి గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 9 September 2016
కరీంనగర్: సిరిసిల్ల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయగా 17 మంది గాయపడ్డారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లాను ఏర్పాటు చేయడంలో మంత్రి కెటిఆర్ నిర్లక్ష్యం చూపుతున్నారని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు.