ఆంధ్రప్రదేశ్‌

కిడ్నాపైన శిశువు క్షేమంగా తల్లిఒడికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో రెండురోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన శిశువును పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి తల్లిఒడికి చేర్చారు. అవనిగడ్డలో ఓ యువతి వద్ద శిశువు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. శిశువును అపహరించినందుకు గంగు నాగమల్లేశ్వరి, రాజా అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వివరాలు రాబడుతున్నారు. అనారోగ్యానికి లోనైన శిశువును ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు. శిశువును క్షేమంగా అప్పగించడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆనందానికి లోనయ్యారు. శిశువు అపహరణ ఘటనపై సాక్షాత్తూ సిఎం చంద్రబాబు ఆరా తీయడంతో పోలీసు అధికారులు పది బృందాలను ఏర్పాటు చేసి గాలించారు.