ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతులకు స్థలాల కేటాయింపు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని ఎపి సిఎం చంద్రబాబు శనివారం నేలపాడులో ప్రారంభించారు. తన మాటకు విలువనిచ్చి సుమారు 33 వేల ఎకరాల పంట పొలాలను రైతులు రాజధాని కోసం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. రైతులను రెచ్చగొట్టి రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు సాగలేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలే తరిమికొడతారని ఆయన చెప్పారు.