జాతీయ వార్తలు

చైనా వస్తువులను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అణు సరఫరాదారుల బృందం (ఎఎస్‌జి)లో భారత్ చేరికకు చైనా మద్దతు ఇవ్వనందుకు నిరసనగా ఆ దేశానికి చెందిన వస్తువులను ప్రజలంతా బహిష్కరించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. చైనాకు నిరసనగా మంగళవారం ఇక్కడ మంచ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చైనా రాయబార కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కనీసం మూడు నెలల పాటు చైనా వస్తువులను కొనడం మానేయాలని జాగరణ్ మంచ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.