శ్రీకాకుళం

అలరించిన చింతామణి నాటక ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), మే 6: అరసవల్లిలో నిర్వహిస్తున్న అసిరితల్లి సిరిమానోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి సమీపంలోని వైజయంతి కళావేదికలో చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లాలోని వరాహానర్శింహపురానికి చెందిన ఉదయం భాస్కర్‌నాటక కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆహుతులను అలరించింది. చింతామణిగా రత్నశ్రీ, సుబ్బిశెట్టిగా సత్యనారాయణ, భవానీగా శేఖర్‌బాబు పాత్రలు పోషించగా ఆర్గనైజర్‌గా వి.రమణమూర్తి వ్యవహరించారు. ఈనెల 17 వరకు పలు సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.