శ్రీకాకుళం

ముగిసిన ఆసెట్ ఎంట్రెన్స్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 6: ఆంధ్రా యూనివర్శిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ సంయుక్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు(ఆసెట్) ఎంట్రన్స్ టెస్ట్ రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. శుక్రవారంతో ఈ టెస్ట్‌ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మండలంలోని మునసబుపేట సమీపంలో ఉన్న గాయిత్రీ విద్యా సంస్థలో ఈ పరీక్షలు నిర్వహించారు. దీనికి ఎగ్జామినేషన్ చీఫ్‌గా గాయిత్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పులఖంఢం శ్రీనివాసరావు వ్యవహరించారు. ఎనిమిది సబ్జెక్టులకు సుమారు 3,600మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, బయోకెమిస్ట్రీ, లైఫ్‌సైన్స్, జియాలజీ తదితర సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలను పర్యవేక్షించేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, కె.రమేష్‌బాబుల విచ్చేశారు. కళాశాలలో ఉండి పరీక్షలను పర్యవేక్షించారు.