శ్రీకాకుళం

జగన్‌తోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, జనవరి 20: రానున్న సాధారణ ఎన్నికల్లో వై ఎస్ జగన్ విజయం సాధిస్తారని జగన్‌తోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యవౌతుందని వైసీపీ రాజకీయ వ్యవహారాల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం కొండపోలవలస, కరకవలస గ్రామాల్లో శనివారం గ్రామస్తులు ఏర్పాటు చేసిన పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ టీడీపికి కాలం దగ్గరపడిందని ప్రజల తీర్పు ఆ పార్టీ నేతలకే అర్థవౌతుందని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పేరిట ప్రజలకన్న ఆ పార్టీ కార్యకర్తలకే అధికంగా లాభాలు చేరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతీ ఓటరు టీడీపీ మాటల మూటలను అర్థం చేసుకున్నారని, ఎన్నికల సమయంలో తగిన గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు మొజ్జాడ శ్యామలరావు , జెడ్పిటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మాజీ ఎంపిపి బగ్గు రామకృష్ణ, జలుమూరు , పెద్దదూగాం, దరివాడ, గొటివాడ, టెక్కలిపాడు, రామయ్యవలస, మాకివలస సర్పంచ్‌లు, ప్రతినిధులు కోనా సంధ్యాదామోదరరావు, మూకళ్ల సుమలత సత్యం, పైడి విఠల్‌రావు, తంగి మురళీకృష్ణ, ధర్మాన నీలవేణి, దువ్వాజి, గరికమ్మ, నాగేశ్వరరావు, దాలినాయుడు, ఎంపిటీసీలు ధనలక్ష్మీ-శశి, రోహిణీ రాజప్పలనాయుడు, నాగేశ్వరరావు, ముఖ్య నేతలు బుక్క లక్ష్మణరావు, కనుసు సీతారాం, మన్మధరావు, విజయ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

జోగినాయుడు మృతి పార్టీకి తీరనిలోటు
* మాజీ ఎమ్మెల్యే కృష్ణదాస్
జలుమూరు, జనవరి 20: స్థానిక ఎంపిటీసీ బగాది వరలక్ష్మీ భర్త జోగినాయుడు మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన స్వగ్రామం జలుమూరు పంచాయతీ కోనసింహాద్రిపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన సంతాప సభలో ముఖ్య అతిధి పాల్గొనిమాట్లాడారు. ఆయన కుటుంబానికి పార్టీ తోడుంటుందన్నారు. జెడ్పిటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మాజీ ఎంపిపి బగ్గు రామకృష్ణ, మొజ్జాడ శ్యామలరావు, సర్పంచ్ ప్రతినిధి కోనా దామోదరరావు తదితరులు జోగినాయుడు గురించి మాట్లాడారు. ఎమ్మెల్యేలు పార్టీలు పిరాయిస్తుంటే ఎంపిటీసీ స్థాయిలో ఎన్నో సేవలు చేశారని జోగినాయుడును కొనియాడారు. ముందుగా జోగినాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పలువురు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.