శ్రీకాకుళం

ఘనంగా శివపార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురుం(రూరల్), జూన్ 17: మండలంలోని మండపల్లిలోని చిదంబశే్వరాలయం వద్ద శివపార్వతుల కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శివాలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి.గంగుడు దంపతులు, టి.గోపి దంపతులు ఈ కల్యాణమహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఢిల్లీరావు, జడ్‌పిటీసీ లింగరాజు, సాహదేవ్, శ్రీను, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

జనచైతన్యమే జనసేన ఆశయం
పొందూరూ,జూన్ 17: జనచైతన్యమే జనసేన ఆశయమని జిల్లా జనసేన పార్టీ శ్రీనివాస ప్రభు అన్నారు. ఆదివారం స్థానిక దివ్యజ్ఞాన సమాజ మందిరంలో మండల జనసేనపార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పైవిధంగా అన్నారు. ప్రియతమ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాదనకు సైనికునిలా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ప్రజా ద్రోహులు, సేవా రాజకీయ నేతలుగా ప్రజలకు మభ్యపెట్టి అవసరం తీరాక అన్యాయం చేసే నేతలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలను మోసగించిన నేతలను చిత్తుగా ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. అట్టడుగు అభాగ్యులైన ప్రజలకు కల్లబొల్లి కథలు చెప్పి మోసగించే నేతలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల్లో పేదవాడి భుజం తట్టి మద్యం తో మబ్బిపెట్టి, సొమ్ములు ఎరచూపి గెలిచిన తర్వాత ఛీదరించే రాజకీయ నేతలపై రాజీలేకుండా పోరాటం చేయండని యువతకు పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో పార్టీ పతాక ఆవిష్కరణ చేయాలని ఆయన కోరారు. యువ నవతరం ముందుకు వచ్చి ఓట్లు నమోదు చేయించే పనిలో నిమగ్నం కావాలని కోరారు. వారసత్వ రాజకీయాలకు సమాధి కట్టేందుకు కార్యకర్తలు గళమెత్తి ప్రచార హోరులో పాల్గోవాలని కోరారు. జనసేన కార్యకర్తలు బడుగు, బలహీన వర్గాల్లో మానవ సేవయే మాధవ సేవగా భావించి సేవలందించాలని కోరారు. దగా పడ్డ పేదల పక్షాన నిలిచి అవసరమైన పోరుకు సిద్ధం కావాలని కోరారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పతాకాలను చేతబూని పలు పురవీధుల మీదుగా అవినీతి అంశం-జనసేన సొంతం, పోరాడి తీరుదాం-సాధించి తీరుదాం అని నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పేడాడ రామ్మోహనరావు, గేదెల చైతన్య, గూటూరు మురళి తదితరులు మాట్లాడారు. మండలం నలుమూలనుండి తరలివచ్చిన కార్యకర్తలు పార్టీ అధినేత జనసేనకు జేజేలు పలుకుతూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.