శ్రీకాకుళం

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జూన్ 28: ఎన్నికల్లో ఇచ్చిన మాటను తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్పష్టం చేశారు. మండలం అంపోలు, శ్రీకూర్మం, వత్సవలస పంచాయతీ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రుణ ఉపశమన పత్రాలను అధికారులు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమాలు సందర్భంగా అంపోలు, శ్రీకూర్మం గ్రామ సభల్లో ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ వ్యవసాయం క్లిష్టతరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం అందజేస్తున్న రెండవ విడత రుణమాఫీ రైతులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ రుణ ఉపశమన పత్రాలు బ్యాంకుల్లో ఉన్న రుణ బకాయిల నుండి రైతులను విముక్తి గావించి ఉపశమనం పొందేవిధంగా ఉపయోగపడతాయన్నారు. బ్యాంకుల్లో ఉన్న రుణ బకాయిలు నుండి విముక్తి పొంది మరలా రుణం పొందేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయన్నారు. శ్రీకూర్మంలో తహశీల్దారు సింహాచలం, వత్సవలసలో ఎం.పి.డి.ఓ. ఆర్. స్వరూపరాణి, అంపోలులో వ్యవసాయాధికారి తిరుమలరావుల ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరిగాయి.