శ్రీకాకుళం

కుటుంబాన్ని మింగిన అప్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస/శ్రీకాకుళం(రూరల్), జూలై 8: ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చేసిన అప్పులే చివరకు ఆ కుటుంబాన్ని మింగేశాయి. బంధువులు, స్నేహితులు, ఆ గ్రామస్థులను శోకసంద్రంలోకి నెట్టివేశాయి. శ్రీకాకుళం మండలంలోని కరజాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం శ్రీకాకుళం రైల్వేస్టేషన్(ఆమదాలవలస) తాండ్రాసమెట్ట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం గంగెట్ల శ్రీనివాసరావు(36), సరోజిని(32)దంపతులు, కుమార్తెలు జగదీశ్వరి(12) ఉమామహేశ్వరి(10) భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఈ ఆఘాయిత్యానికి పాల్పడింది.
సంఘటనా స్థలం వద్ద ఓ నోటు రాసి ఈ ఘటనకు పాల్పడటం తీవ్ర సంచలనం రేపింది. ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ తగాదాలా లేకుంటే ఆస్తి తగాదాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలకు శవపంచనామాలు నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ప్రాథమిక సమాచారాన్ని సేకరించి రైల్వే ఉన్నతాధికారులకు, జిల్లా పోలీస్ శాఖకు నివేదించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.