ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర నిధులకు మోదీ పేరు పెట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మండలిలో సోము వీర్రాజు
హైదరాబాద్, మార్చి 15: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాల కింద వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రాలకు విడుదలవుతున్నాయని, వాటి పేర్లను మార్చి, ప్రభుత్వాలు లబ్దిదారులకు అందిస్తున్నాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాల కింద విడుదల చేస్తున్న నిధులకు మోదీ పేరును చేర్చి, లబ్దిదారులకు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనమండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేంద్ర విడుదల చేస్తున్న నిధులను లబ్దిదారులకు ఇచ్చేప్పుడు చంద్రబాబు, లేదా ఎన్టీఆర్ పేర్లను చేర్చుతున్నారని, ఇకపై మోదీ పేరుతో ఆయా పథకాలను జనాల్లోకి తీసుకువెళితే బాగుంటుందని అన్నారు. దీనికి మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ, మోదీ పేరు చేర్చడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు.