జాతీయ వార్తలు
సోనియా, రాహుల్ పిటిషన్ను కొట్టేసిన కోర్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 December 2015
ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల కేసు విచారణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ దాఖలుచేసుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. విచారణకు కోర్టులో హాజరుకావాలని కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని సోనియా, రాహుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రు స్థాపించిన విషయం విదితమే. దీని ఆస్తులకు సంబంధించి భాజాపా నేత సుబ్రమణ్యం స్వామి పిటిషన్ను దాఖలు చేశారు.