జాతీయ వార్తలు

రైల్లో ప్రయాణించిన సురేష్ ప్రభు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఇక్కడ లోకల్ రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఓ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ లోకల్ రైలు ఎక్కారు. ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంటులో ఎక్కిన ఆయన గమ్యస్థానం చేరేవరకూ నిలబడే ప్రయాణించారు. ఆయన వెంట రైల్వేశాఖ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రోడ్డుమార్గాన కారులో వెళితే ఆలస్యమవుతుందని, తొందరగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయన రైలులో ప్రయాణించారు. గత ఏడాది కూడా సురేష్ ప్రభు లోకల్ రైలులో ఓసారి ప్రయాణించారు.