ఆంధ్రప్రదేశ్
నామినేషన్ వేసిన సురేష్ ప్రభు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 May 2016
హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ నామినేషన్ పత్రాలపై ఎపి సిఎం చంద్రబాబు సంతకం చేయడం విశేషం. ముంబయికి చెందిన సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభ ఎన్నికలకు బిజెపి అధిష్ఠానం ఎంపిక చేయడం తెలిసిందే. సంకీర్ణ ధర్మంలో భాగంగా ఒక రాజ్యసభ సీటును బిజెపికి టిడిపి కేటాయించింది. నగరంలోని బిజెపి కార్యాలయం నుంచి ఎపి అసెంబ్లీ వరకూ జరిగిన ర్యాలీలో సురేష్ ప్రభు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు యనమల, అచ్నెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.