తెలంగాణ

యువతకు స్ఫూర్తి సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రమశిక్షణ, నిరంతర శ్రమ, సంకల్ప బలంతో బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశానికి వనె్న తెచ్చిందని తెలంగాణ మంత్రులు కెటిఆర్, నాయిని నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం సింధు గౌరవార్థం తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన సత్కార సభలో మంత్రులు మాట్లాడారు. నేటి యువతకు సింధు స్ఫూర్తిదాతగా నిలిచిందని వారు అన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని వివరించారు. వచ్చే ఒలింపిక్స్‌కు తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులను పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు.