క్రీడాభూమి

‘గ్రేట్ ఇండియా’లో మిలింద్ సోమన్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో పరుగును క్రీడగా అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహించనున్న ‘గ్రేట్ ఇండియా రన్’లో బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ (50) పాల్గొననున్నాడు. దేశ, విదేశాలకు చెందిన 15 మంది మేటి మారథానర్లతో ఆరు రాష్ట్రాలను (ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ) కవర్‌చేస్తూ మొత్తం 1,480 కిలోమీటర్ల దూరం మేరకు ఈ పరుగును నిర్వహించనుండగా, ‘ఐరన్ మ్యాన్’గా పేరు పొందిన సోమన్ జులై 27వ తేదీన అహ్మదాబాద్ నుంచి సిల్వస్సా మీదుగా ముంబయి వరకు 570 కిలోమీటర్ల దూరం ఈ పరుగులో పాల్గొననున్నాడు. గ్రేట్ ఇండియా రన్‌లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని, ఈ పరుగు జరిగే మార్గంలో దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వెస్సా కూడా ఉండటం సంతోషాన్ని కలిగిస్తోందని మిలింద్ సోమన్ తెలిపాడు.