క్రీడాభూమి

భారత్‌తో సిరీస్‌కు తెర స్పష్టం చేసిన పిసిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 23: డెడ్‌లన్‌ను ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చివరికి భారత్‌తో సిరీస్ జరిగే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చింది. చాలా కాలంగా తాము భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సమాధానం కోసం ఎదురుచూశామని పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఒకవేళ ఇప్పుడు భారత ప్రభుత్వం సిరీస్‌కు ఆమోద ముద్ర వేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశాడు. భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని, అయితే, జనవరిలో మాత్రం సిరీస్ సాధ్యం కాదని అన్నాడు. ఇతర సిరీస్‌లలో ఆడాల్సి ఉన్నందున వచ్చేనెల మొదటి వారం తర్వాత భారత్‌తో సిరీస్ ఆడే అవకాశం ఉందని తెలిపాడు. ఒకవేళ ఒకటిరెండు రోజుల్లో భారత ప్రభుత్వం సిరీస్‌ను ఆమోదించినా, తమకు తగినం సమయం ఉండదని అతను స్పష్టం చేశాడు.