క్రీడాభూమి

ఎన్‌సిఎలో కొత్త కోచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ)లో కోచ్‌గా మాజీ టెస్టు క్రికెటర్లు డబ్ల్యువి రామన్, నరేంద్ర హీర్వాణీ, టిఎ శేఖర్‌లను నియమించినట్టు బిసిసిఐ ప్రకటించింది. రామన్ బ్యాటింగ్ కోచ్‌గా ఉంటాడని, శేఖర్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా, హీర్వాణీ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తారని బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ వీరికి సహాయసహకారాలు అందించేందుకు కోచ్‌ల ప్యానెల్ ఉంటుందని తెలిపాడు. ఎన్‌సిఎ డైరెక్టర్, మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించి వీరిని ఎంపిక చేశారని తెలిపాడు.