క్రీడాభూమి

పింక్ పాంథర్స్‌కు యు-ముంబా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 14: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో సీజన్‌లో టేబుల్ టాపర్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు యు-ముంబా షాక్ ఇచ్చింది. గురువారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో యు-ముంబా 29-23 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో నాలుగో ఎగబాకింది. ఎంతో అనుభవజ్ఞులైన రాకేష్ కుమార్, అనూప్ కుమార్ 12 పాయింట్లు సాధించి యు-ముంబాకు ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన యు-ముంబాకు ఇది ఐదో విజయం. ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ డిఫెన్స్ విభాగం తమ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడంతో ఆ జట్టు 6 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పాంథర్స్‌కు ఇది మూడో ఓటమి. అయినప్పటికీ ఇంతకుముందు మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన పింక్ పాంథర్స్ మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.