క్రీడాభూమి

బాడ్మింటన్ ఈవెంట్ తరలింపుపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, డిసెంబర్ 25: షిల్లాంగ్‌లో జరగాల్సిన బాడ్మింటన్ ఈవెంట్‌ను గౌహతికి తరలించడం పట్ల మేఘాలయ ఒలింపిక్ సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఇంతకుముందు నిర్ణయించినట్లుగా ఈ ఈవెంట్‌ను షిల్లాంగ్‌లోనే నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి, దక్షిణాసియా క్రీడల నిర్వాహక కమిటీకి లేఖ రాస్తామని మేఘాలయ రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు జాన్ ఎఫ్.ఖర్షింగ్ శుక్రవారం స్పష్టం చేశాడు. గురువారం షిల్లాంగ్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మేఘాలయ ఒలింపిక్ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. బాడ్మింటన్ ఈవెంట్‌ను గౌహతికి మార్చడం పట్ల మేఘాలయ ప్రభుత్వం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి ఎఫ్‌ఆర్.ఖర్గోంగర్ సంబంధిత విభాగాలకు నిరసన లేఖలు రాశాడు. షిల్లాంగ్ నుంచి బాడ్మింటన్ ఈవెంట్‌ను మార్చాలన్న నిర్ణయం మేఘాలయ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటూ, ఈ ఈవెంట్ నిర్వాహకులు రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.