క్రీడాభూమి

పాంథర్స్‌కు వారియర్స్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 16: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఇక్కడ వరస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న బెంగాల్ వారియర్స్ జట్టు బలీయమైన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై 32- 25 పాయింట్ల తేడాతో అనూహ్య విజయం సాధించి తన ఆశలను సజీవంగా నిలుపుకోగలిగింది. తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన బెంగాల్ వారియర్స్ జట్టులో కొరియా రైడర్ జంగ్ కున్ లీ అద్భుతంగా రాణించి 11 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లీ ఉత్తమ రైడర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట మూమెంట్ అవార్డులను కూడా దక్కించుకున్నాడు. కాగా, మాజీ చాంపియన్లయిన పింక్ పాంథర్స్‌కు ఇది వరసగా రెండో ఓటమి. పది మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 32 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఈ విజయంతో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ వారియర్స్ 16 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది.