క్రీడాభూమి

పాకిస్తాన్‌తో రెండో టెస్టు.. ఇంగ్లాండ్ జట్టులో ఆండర్సన్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 20: పాకిస్తాన్‌తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ కోసం 14 మంది సభ్యులతో ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టులో ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో పాటు లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు చోటు కల్పించారు. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 75 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆండర్సన్, స్టోక్స్, రషీద్ పాల్గొనలేదు. అయితే ఇంగ్లాండ్‌లో ఆల్‌టైమ్ లీడింగ్ టెస్టు వికెట్ టేకర్‌గా ఉన్న ఆండర్సన్ భుజానికి తగిలిన గాయం నుంచి, అలాగే స్టోక్స్ మోకాలి గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గడంతో వీరిద్దరికీ రెండో టెస్టులో స్థానం లభించింది. ఇదిలావుంటే, లార్డ్స్ టెస్టులో పాక్ బ్యాట్స్‌మన్ల చేతిలో పరాభవానికి గురైన ఆఫ్ స్పిన్నర్ మొరుూన్ అలీతో పాటు అతనికి ప్రత్యామ్నాయంగా ఆదిల్ రషీద్‌ను కూడా రెండో టెస్టుకు ఎంపిక చేశారు. అయితే ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకూ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగుతాడా? లేక పెవిలియన్‌కే పరిమితమవుతాడా అన్నది వేచిచూడాల్సిందే.