క్రీడాభూమి

ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్ ఉత్కంఠ పోరులో పుణెరీ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: బెంగళూరు బుల్స్‌తో బుధవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్ లీగ్ మ్యాచ్‌లో పుణెరీ పల్టన్ మూడు పాయంట్ల తేడాతో గెలిచింది. ఈ జట్టు 36 పాయంట్లు సాధించగా, గట్టిపోటీనిచ్చిన బెంగళూరు 33 పాయంట్లు చేసింది. పుణెరీ కెప్టెన్ మన్జీత్ చిల్లార్ 11 పాయంట్ల తో రాణించి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీపక్ నివాస్ హూడా తొమ్మిది పాయంట్లు చే శాడు. బెంగళూరు కెప్టెన్ రోహిత్ కుమార్ తొమ్మిది పాయంట్లు సంపాదించాడు. మోహిత్ చిల్లార్ 8 పాయం ట్లు సాధించాడు. కానీ, మిగతా ఆటగాళ్ల వైఫల్యం కారణంగా బెంగళూరుకు ఓటమి తప్పలేదు.
చివరి లీగ్ మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీని యు ముంబా నాలుగు పాయంట్ల తేడాతో ఓడించింది. చివరి వరకూ లీడ్ లో ఉన్న ఢిల్లీ 34 పాయంట్ల వద్ద నిలిచిపోగా, ఆఖరి క్షణాల్లో అద్భుతంగా రాణించిన యు ముంబా 38 పా యంట్లు చేసి విజయభేరి మోగించింది.

బెంగళూరు బుల్స్, పుణెరీ పల్టన్ మధ్య బుధవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో ఓ దృశ్యం