క్రీడాభూమి

కేదార్, శ్రేయాస్ అర్ధ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్‌కే (ఆస్ట్రేలియా), ఆగస్టు 27: నాలుగు జట్లు పోటీపడుతున్న క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ పర్ఫార్మెన్స్ స్క్వాడ్ (ఎన్‌పిఎస్)పై భారత్ ‘ఎ’ ఆరు వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. కేదార్ జాదవ్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ శతకాలతో రాణించి, భారత్ ‘ఎ’ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎన్‌పిఎస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసింది. శామ్ హార్పర్ 72 పరుగులు చేయగా, వరుణ్ ఆరోన్ 58 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 38.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. నాలుగోవికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన కేదార్ 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ 62 పరుగులు చేశాడు. ఎన్‌పిఎస్ బౌలర్ టామ్ ఒ డొనెల్ 28 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. కానీ, జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.