క్రీడాభూమి
దులీప్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్కు ఇండియా రెడ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 September 2016
గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 1: ఇండియా రెడ్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరింది. ఇండియా బ్లూతో తలపడిన ఇండియా రెడ్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 285 పరుగులు చేసింది. మాయాంక్ అగర్వాల్ 92, గౌతం గంభీర్ 77 పరుగులతో రాణించగా, కుల్దీప్ యాదవ్ 78 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాత వర్షం కారణంగా ఆట కొనసాగలేదు. చివరి రోజైన గురువారం కూడా ఆట జరగకపోవడంతో, మ్యాచ్ని డ్రాగా ప్రకటించారు. పాయింట్ల ఆధారంగా ఇండియా రెడ్ ఫైనల్ చేరుకుంది. ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్ మధ్య ఈనెల నాలుగు నుంచి మొదలయ్యే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇండియా రెడ్ను ఢీ కొంటుంది.