క్రీడాభూమి

‘దులీప్’ నుంచి కోహ్లీకి విశ్రాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పాల్గొన్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే దులీప్ ట్రోఫీ డేనైట్ మ్యాచ్ నుంచి విశ్రాంతి లభించే అవకాశాలున్నాయ. న్యూజిలాండ్‌తో సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో అ తనికి తగినంత విశ్రాంతి అవసరమని బిసిసిఐ ఆలోచి స్తున్నట్టు సమాచారం. అతనితోపాటు మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ తదితరులను కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్ నుంచి మినహాయంచే అవకాశాలు ఉన్నాయ. అయతే, గులాబీ రంగు బంతులను మొదటి సారి వాడనున్న ఈ ఫ్లడ్‌లైట్స్ మ్యాచ్‌లో ఆజింక్య రహా నే, అశ్విన్, అమిత్ మిశ్రా వంటి మేటి క్రికెటర్లు బరిలోకి దిగుతారు. డే/నైట్ టెస్టులపై దృష్టిపెట్టిన బిసిసిఐ సన్నద్ధ క మ్యాచ్‌లో దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను ఎంపిక చేసింది.