క్రీడాభూమి

సానియా, డోడింగ్ జోడీ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయాల బోణీ చేసింది. మొదటి రౌండ్‌లో సానియా, డోపింగ్ జోడీ 6-4, 6-4 స్కోరుతో డొనాల్డ్ యంగ్, టేలర్ టౌన్‌సెండ్ జోడీని గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. కెనడా క్రీడాకారిణి గాబ్రియెలా డబ్రోవ్‌స్కీతో కలిసి ఆడుతున్న రోహన్ బొపన్న కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. బొపన్న, డబ్రోవ్‌స్కీ జోడీ 7-5, 6-4 స్కోరుతో నొవా రూబిన్, జెమీ లొయెబ్ జోడీపై విజయం సాధించింది. అయితే, పురుషుల డబుల్స్‌లో బొపన్నకు నిరాశే మిగిలింది. ఫ్రెడెరిక్ నీల్సెన్ (డెన్మార్క్)ను భాగస్వామిగా చేసుకున్న అతను బ్రియాన్ బకెర్, మార్కస్ డానియెల్ జోడీ చేతిలో 2-6, 6-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ పోరు కూడా పురుషుల డబుల్స్ విభాగంలో ముగిసింది. ఆండ్రె బెగెమన్ జోడీగా బరిలోకి దిగిన అతనిని స్టెఫెన్ రాబర్ట్, డుడీ సెలా జోడీ 2-6, 7-5, 6-4 తేడాతో ఓడించింది.
ప్రాంజల శుభారంభం: జూనియర్ బాలికల విభాగంలో యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. విక్టోరియా ఎమ్మా (అమెరికా)పై ఆమె మొదటి రౌండ్‌లో 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది.

చిత్రం..ఇవాన్ డోడింగ్, సానియా మీర్జా