క్రీడాభూమి

జపాన్ ఓపెన్ బాడ్మింటన్ మెయిన్ డ్రాకు కశ్యప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 20: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. మంగళవారం అతను రెండో క్వాలిఫయింగ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ అన్టోనె్సన్‌ను 21-18, 21-12 తేడాతో ఓడించాడు. కాలి గాయంతో బాధపడుతూ ఇటీవల కాలంలో టోర్నీలకు దూరమైన కారణంగా కశ్యప్ క్వాలిఫయర్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. ఈ అడ్డంకిని సునాయాసంగా అధిగమించిన అతను మెయిన్ డ్రాలో అతను మొదటి రౌండ్‌లోనే కిడాంబి శ్రీకాంత్‌ను ఢీకొనాల్సి ఉంది. ఇద్దరు భారత ఆటగాళ్లు తొలి రౌండ్‌లో తలపడడం భారత్‌కు ఎదురుదెబ్బ అని చెప్పాలి.

చిత్రం.. పారుపల్లి కశ్యప్