క్రీడాభూమి

బ్రిక్స్’ అండర్-17 ఫుట్‌బాల్ ట్రోఫీని ఆవిష్కరించిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: గోవాలో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) సభ్య దేశాల మధ్య నిర్వహించనున్న అండర్-17 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, బ్రిక్స్ సభ్య దేశాల రాయబారుల సమక్షంలో మోదీ ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరిగి, భాగస్వాముల మధ్య మరింత అవగాహనతో మైత్రీ బంధం బలపడాలన్న లక్ష్యాన్ని సాధిస్తుందని నరేంద్ర మోదీ ఆకాంక్షించారని ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పిఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది.