క్రీడాభూమి

శిఖర్ ధావన్ స్థానంలో.. కరుణ్ నాయర్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 4: ఇండోర్‌లో ఈ నెల 8నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్‌కోసం భారత జట్టులో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కర్నాటకకు చెందిన యువ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్‌ను తీసుకున్నారు. ఎడం చేతి బొటనవేలు గాయం కారణంగా మూడో టెస్టుకు శిఖర్ ధావన్ దూరం కావడంతో కరుణ్ నాయర్‌కు అవకాశం లభించింది. నాయర్ భారత్ తరఫున ఇప్పటివరకు రెండు వన్‌డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. భారత్ జట్టులో గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో కరుణ్ నాయర్‌ను అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే ఒక ప్రకటనలో తెలిపాడు. కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా శిఖర్‌ధావన్ బొటనవేలికి గాయం అయింది.కాగా, భారత జట్టులో గౌతమ్ గంభీర్ ఇప్పటికే రిజర్వ్ ఓపెనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అందువల్ల మూడో టెస్టుకు గంభీర్ జట్టులోకి రావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.