క్రీడాభూమి

డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లింగ్‌పై సుశీల్ ఆసక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్ (డబ్ల్యుడబ్ల్యుఇ)పై ఆసక్తి చూపుతున్నట్టు వస్తున్న వాదనకు బలం చేకూరుతున్నది. ఆర్లాండో (్ఫ్లరిడా) నుంచి వచ్చిన డబ్ల్యుడబ్ల్యుఇ చీఫ్ కాన్యన్ సీమన్‌ను సుశీల్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌లోనూ డబ్ల్యుడబ్ల్యుఇ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు సీమన్ ఇక్కడికి వచ్చాడు. ‘ది గ్రేట్’ ఖలీగా అందరికీ తెలిసిన దలీప్ సింగ్ రాణా ద్వారా ఇప్పటికే ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌కు భారత్‌లో గుర్తింపు లభించింది. చాలామంది ఈ పోటీల పట్ల ఆసక్తిని చూపుతున్నారు. టిఎన్‌ఎ వంటి వివిధ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్ నిర్వహణ సంస్థలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సీమన్ ఇక్కడికి రావడం ఆసక్తిని రేపుతున్నది. సుశీల్ అతనిని ఎందుకు కలిశాడన్న అంశంపై జోరుగా చర్చ సాగుతున్నది. అయితే, సీమన్‌ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేదని సుశీల్ అంటున్నాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టే విషయంలో ఇప్పుడే ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేనని చెప్పాడు. అయితే, సుశీల్ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడని, అందుకే సీమన్‌ను కలిశాడని అతని సన్నిహితులు అంటున్నారు. త్వరలోనే సుశీల్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని స్పష్టం చేస్తున్నారు.