క్రీడాభూమి

సత్తా చాటిన రెజ్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ముగిసిన ఆరో ఎడిషన్ టిఫ్సా ప్రపంచ క్రీడల్లో భారత రెజ్లర్లు సత్తా చాటుకున్నారు. స్వర్ణం సహా మొత్తం నాలుగు పతకాలను కైవసం చేసుకుని ఘనంగా పోరాటాన్ని ముగించారు. 60 కిలోల విభాగం ఫైనల్ బౌట్‌లో దాల్మియా 4-1 తేడాతో అజర్‌బైజాన్ రెజ్లర్ ముహమ్మద్ సహన్‌ను మట్టికరిపించి పసిడి పతకాన్ని చేజిక్కించుకోగా, ఎంతో అనుభవజ్ఞుడైన లవ్ సింగ్ రజత పతకాన్ని, నవీన్ కుమార్, జోసిల్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అజర్‌బైజాన్‌కు చెందిన ముహమ్మద్ అలీమ్‌తో జరిగిన 80 కిలోల ఫైనల్ బౌట్‌లో 5-1 తేడాతో ఓటమిపాలైన లవ్ సింగ్ పోడియంపై రెండో స్థానంలో నిలిచాడు. 90 కిలోల సూపర్ హెవీవెయిట్ విభాగంలో కాంస్య పతకాల కోసం జరిగిన బౌట్లలో నవీన్ కుమార్ 5-2 తేడాతో లిధువేనియా రెజ్లర్ ఒలెగ్‌ను, జోసిల్ 3-1 తేడాతో అఫ్గానిస్తాన్ రెజ్లర్ ముస్త్ఫా సుల్తానీని మట్టికరిపించారు.