క్రీడాభూమి
జాతీయ రెజ్లింగ్లో తోమర్కు స్వర్ణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోండా (ఉత్తర ప్రదేశ్), అక్టోబర్ 24: జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఒలింపియన్ సందీప్ తోమర్ స్వర్ణ పతకం సాధించాడు. 57 కిలోల విభాగంలో పోటీపడిన అతను ఫైనల్లో ఉత్కృష్ట్ కాలేను ఓడించాడు. అంతకు ముందు అమిత్ కుమార్ను ఓడించిన ఉత్కృష్ట్ తుది పోరులో తోమర్ను ఓడించలేక పోయాడు. 65 కిలోల విభాగంలో భజరంగ్కు టైటిల్ దక్కింది. ఫైనల్లో ఓడిన రాహుల్ మాన్ రజత పతకాన్ని స్వీకరించాడు. 70 కిలోల ఈవెంట్లో వినోద్ కుమార్ను ఓడించిన అమిత్ ధంకర్ స్వర్ణ పతకం సాధించాడు. 74 కిలోల విభాగంలో సందీప్ కారేపై గెలిచిన జితేందర్కు స్వర్ణ పతకం లభించింది. మహిళల 48 కిలోల విభాగంలో ప్రియాంక సింగ్ను ఓడించిన రీతూ ఫొగత్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 58 కిలోల విభాగంలో మంజుకు టైటిల్ దక్కింది. ఆమె ఫైనల్లో సొనాలీపై గెలిచింది.