క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో కొత్త పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, నవంబర్ 9: పర్యావరణ పరిరక్షణతోపాటు, ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యర్థాలను తిరిగి ఉపయోగించే అవకాశాలపై అవగాహన పెంచడానికి వీలుగా 2020 ఒలింపిక్స్‌లో పతకాలను ఆ వ్యర్థాలతోనే తయారు చేయాలని నిర్వాహణ కమిటీ తీర్మానించింది. పాడైన సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ ద్వారా పతకాలు తయారు చేస్తామని తెలిపింది. అయితే, అన్ని పతకాలనూ ఇదే రీతిలో తయారు చేయాలా లేదా కొన్ని పతకాలకు మాత్రమే పరిమితం చేయాలా అన్న విషయాన్ని కమిటీ తన ప్రకటనలో స్పష్టంగా పేర్కోలేదు. కానీ, పర్యావరణ పరిరక్షణకు టోక్యో ఒలింపిక్స్‌లో పెద్దపీట వేస్తామని, అందుకే ఎలక్ట్రానిక్స్ వ్యర్ధానలను రీసైక్లింగ్ చేస్తామని వివరించింది. ఇలావుంటే, టోక్యో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని, పర్యావరణ పరిరక్షణకు క్రీడా రంగం కృషి కూడా మొదలవుతుందని నిపుణులు అంటున్నారు.