క్రీడాభూమి
ప్రొఫెషనల్స్గా మారేందుకు అనుమతించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 11: భారత బాక్సిర్లు అఖిల్ కుమార్, జితేందర్ కుమార్ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ను కలిసి, ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్కు అనుమతించాలని కోరారు. హర్యానా భవన్లో ఖట్టార్ను కలిసిన వీరు ఇది వరకే తాము పోలీస్ శాఖకు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఆమోద ముద్ర వేయాలని అభ్యర్ధించారు. ఇటీవలే హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను కూడా కలిశారు. ప్రొఫెషనల్ బాక్సర్గా కెరీర్ను ఆరంభించాలని కోరుకుంటున్నానని, అందుకే, జితేందర్తోపాటు తాను ముఖ్యమంత్రిని కలిసి తన అభిప్రాయాన్ని చెప్పానని అఖిల్ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపాడు. అదే విధంగా ప్రొఫెషనల్ బాక్సింగ్కు మన దేశంలో భవిష్యత్తు ఏ విధంగా ఉందనే విషయం కూడా చర్చించామని అన్నాడు. అఖిల్, జితేందర్ ఇద్దరూ పోలీస్ శాఖలో పని చేస్తున్నందువల్ల ప్రొఫెషనల్స్గా మారేందుకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అవుతుంది.