క్రీడాభూమి

ముమ్మర సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్): రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడనున్న భారత్- ఇంగ్లాండ్ జట్లు మంగళవారం విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముమ్మర సాధన చేశాయి. స్టేడియానికి ఉదయం 9 గంటలకు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు పిచ్‌ను కొంతసేపు పరిశీలించిన అనంతరం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. కుక్ నాయకత్వంలోని ఆ జట్టు ఎక్కువగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చి మూడు గంటల పాటు విరామం లేకుండా నెట్స్‌లో సాధన చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేడియానికి చేరుకున్న భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పిచ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం ప్రాక్టీస్ ప్రారంభించిన భారత్ జట్టు ఫీల్డింగ్ అనంతరం ఫుట్‌బాల్ రిక్రియేషన్ గేమ్ ఆడుతూ సరదాగా గడిపారు.

చిత్రం..ప్రాక్టీస్ సెషన్‌లో భారత క్రికెటర్లు, భారత్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు