క్రీడాభూమి

చైనా ఓపెన్ బాడ్మింటన్ సెమీస్ చేరిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫజూ (చైనా), నవంబర్ 18: చైనా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్‌లో ఆమె హి బింగ్ జియోను 22-20, 21-10 తేడాతో ఓడించింది. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె సంగ్ జీ హ్యున్‌ను ఢీ కొంటుంది. అంతకు ముందు మరో క్వార్టర్ ఫైనల్‌లో హ్యున్ 22-20, 10-21, 21-18 ఆధిక్యంతో అనేకా యమగూచిపై విజయం సాధించింది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్ నుంచి వెనుదిరిగాడు. అతనిపై చెన్ లాంగ్ 21-15, 21-14 తేడాతో గెలిచి, సెమీస్ పోరును విక్టర్ అక్సెల్సెన్‌తో ఖాయం చేసుకున్నాడు. అక్సెల్సెన్ క్వార్టర్ ఫైనల్‌లో తకుమా ఉయేదాను 21-11, 21-16 తేడాతో ఓడించాడు.

చిత్రం.. పివి సింధు