క్రీడాభూమి

చెన్నై టెస్టుపై వీడని సస్పెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన నేపథ్యంలో, ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఐదవ, చివరి టెస్టు జరుగుతుందా లేదా అన్న అనుమానం తలెత్తుతున్నది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. ప్రస్తుతానికి చెన్నై టెస్టుపై ఎలాంటి ఆలోచన లేదా వ్యూహం లేవని స్పష్టం చేశాడు. తమిళనాడులో ప్రజలు ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా స్పందిస్తారు కాబట్టి, జయలలిత మృతితో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న భయం అందరినీ వెంటాడుతున్నది. అక్కడ టెస్టు జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. ఒకవేళ చెన్నైలో టెస్టును నిర్వహించడం కుదరకపోతే, మొహాలీ లేదా పుణే చివరి మ్యాచ్‌కి వేదిక అవుతుంది.