క్రీడాభూమి

భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 8: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. కెనడాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగితే, కెనడా క్రీడాకారులు ప్రేక్షక పాత్ర పోషించారు. మ్యాచ్ 35వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్ మన్దీప్ సింగ్ ద్వారా లభించింది. మరో 11 నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. 60వ నిమిషంలో వరుణ్ కుమార్, 66వ నిమిషంలో అజిత్ పాండే చేసిన గోల్స్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా, నాలుగు గోల్స్ తేడాతో గెలిచింది.