క్రీడాభూమి
రీఫెల్కు విశ్రాంతి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, డిసెంబర్ 9: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజున తలకు బంతి తగలడంతో స్వల్పంగా గాయపడిన అంపైర్ పాల్ రీఫెల్కు విశ్రాంతినివ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయించింది. జెన్నింగ్స్ కొట్టిన బంతిని స్క్వేర్లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేసిన భువీ, దానిని వికెట్కీపర్ పార్థీవ్ పటేల్ వైపు విసిరాడు. అయితే, బంతి నేరుగా వెళ్లి లెగ్ అంపైర్ రీఫెల్ తల వెనుక భాగంలో తగిలింది. అక్కడే కిందపడిన అతనిని అధికారులు, గ్రౌండ్ స్ట్ఫా వెంటనే మైదానం నుంచి బయటకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపించిన విషయం తెలిసిందే. గాయం తీవ్రమైనదేమీ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించినప్పటికీ, ముందు జాగ్రత్తగా అతనికి ఈ మ్యాచ్లో మిగతా నాలుగు రోజుల ఆట నుంచి విశ్రాంతినిస్తున్నట్టు ఐసిసి ప్రకటించింది.
చిత్రం.. మైదానంలో పడిపోయన రీఫెల్