క్రీడాభూమి

సూపర్ సిరీస్ బాడ్మింటన్ ఫైనల్స్ రెండో మ్యాచ్‌లో సింధు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 15: అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టోర్నీ రెండో మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి, హైదరాబాదీ పివి సింధు పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన అయాకా యమాగూచీని ఓడించి, శుభారంభం చేసిన సింధు రెండో రౌండ్‌లో సన్ యూ చేతిలో 15-21, 17-21 తేడాతో చిత్తయింది. గ్రూప్ ‘బి’ నుంచి పోటీపడుతున్న సింధు చివరి లీగ్ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌ను ఢీ కొంటుంది. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’లో మొదటి రెండేసి స్థానాల్లో ఉన్న వారు సెమీ ఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు.