క్రీడాభూమి

విచారణ ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, డిసెంబర్ 24: సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో నకిలీ డోప్ శాంపిల్స్ ఆరోపణలపై అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) విచారణను ముమ్మరం చేసింది. మొత్తం 28 మంది రష్యన్లను ఇప్పటికే దోషులుగా తేల్చింది. వీరిపై విచారణ కొనసాగుతున్నదని ఐఒసి ప్రకటించింది. డోప్ దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారికి ప్రభుత్వ మద్దతు ఉందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పష్టం చేస్తుండగా, వివిధ క్రీడా సమాఖ్యలు మాత్రం రష్యా ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.