క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి అందరి దృష్టినీ ఆకట్టుకున్న సాక్షి మాలిక్ ఈ టోర్నీలో స్టార్ అట్రాక్షన్‌గా మారనుంది. ఆమెతోపాటు ‘్ఫగట్ సిస్టర్స్’ కూడా అభిమానులను ఆకర్షించనున్నారు. అమీర్ ఖాన్ తీసిన దంగల్ సినిమా వారి జీవిత గాథే కావడంతో, ఫొగట్ సిస్టర్స్‌ను బరిలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడడం ఖాయం. స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ వ్యక్తిగత కారణాలతో ఈసారి పిడబ్ల్యుఎల్‌కు హాజరుకావడం లేదు. మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కేసును ఎదుర్కొంటున్నాడు. దీనితో పురుషుల విభాగం కళావిహీనంగా మారింది. మహిళల విభాగంలో హోరాహోరీ పోరు అభిమానులను అలరించనుంది. ఈ టోర్నీలో ఢిల్లీ సుల్తాన్స్, హర్యానా హ్యామర్స్, ఎన్‌సిఆర్ పంజాబ్ రాయల్స్, ముంబయి మరాఠీ, జైపూర్ నింజాస్, యుపి దంగల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి.