క్రీడాభూమి

మలేసియా మాస్టర్స్ క్వార్టర్స్‌కు సైనా, జయరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరవాక్ (మలేసియా), జనవరి 19: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో సైనా 21-17, 21-12 ఆధిక్యంతో హన్నా రమాదినీ (ఇండోనేషియా)ను చిత్తుచేసింది. ఆరోసీడ్ జయరామ్ 21-12, 15-21, 21-15 స్కోరుతో సూ సుయాన్ ఈని ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌లో అనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ కూడా ఓటమిపాలైంది. వీరిని హెండ్రా అర్పిదా గుణవాన్, మార్కిస్ కిడో జోడీ 21-17, 18-21, 21-12 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్‌లో అర్జున్, రామచంద్రన్ శ్లోక్ 14-21, 17-21 తేడాతో లా చెక్ హిమ్, లీ చున్ హెయ్ రెగినాల్డ్ జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూశారు.