క్రీడాభూమి

భారత్, ఇంగ్లాండ్ అండర్-19 క్రికెట్ నాగపూర్‌లో టెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగే రెండు టెస్టులకు నాగపూర్ వేదిక కానుంది. వాస్తవానికి ఈ రెండు టెస్టులు చెన్నైలో జరగాలి. అయితే, లోధా కమిటీ సూచనలను అమలు చేసి తీరాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) పరోక్షంగా సహాయ నిరాకరణను ఆరంభించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు జరిగే మొదటి, 21 నుంచి 24 వరకు జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లను నిర్వహించలేమని చేతులెత్తేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ బిసిసిఐకి లేఖ కూడా రాసింది. కాగా, టిఎన్‌సిఎ తన అసక్తతను వెల్లడించిన వెంటనే విదర్భ క్రికెట్ సంఘం (విసిఎ) స్పందించింది. ఆ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇంగ్లాండ్ అండర్-19తో జరిగే ఐదు వనే్డలు, రెండు టెస్టుల్లో ఆడే భారత అండర్-19 జట్టును శుక్రవారం ప్రకటించిన బిసిసిఐ నాగపూర్‌లో టెస్టులను ఖరారు చేసింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మూడు, బ్రబౌర్న్ మైదానంలో రెండు వనే్డ ఇంటర్నేషనల్స్ జరుగుతాయి.