క్రీడాభూమి
గౌతం గంభీర్పై వేటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఢిల్లీ వనే్డ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్పై వేటు పడింది. అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించిన ఢిల్లీ సెలక్షన్ కమిటీ ఆ స్థానాన్ని యువ వికెట్కీపర్-బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు అప్పగించింది. కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ స్వయంగా గంభీర్కు ఈ మార్పు గురించి తెలియచేసినట్టు సమాచారం. ఇలావుంటే, జట్టుకు నాయకత్వం వహించగల సత్తావున్న ఆటగాడి కోసం చాలాకాలంగా వేచి చూస్తున్నామని, కానీ, ఇంత వరకూ తమకు సరైన అభ్యర్థి లభించలేదని ఢిల్లీ సెలక్టర్, మాజీ స్పిన్నర్ నిఖిల్ చోప్రా శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. 21 ఏళ్ల రిషభ్ పంత్ ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన టి-20 సిరీస్కు ఎంపికైన భారత జట్టులో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.
చిత్రం..ఢిల్లీ వనే్డ జట్టు కొత్త కెప్టెన్ రిషభ్ పంత్