క్రీడాభూమి
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ మనోజ్ ముందంజ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ ముందం చేశాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, మొదటి రౌండ్లో బై లభించిన మనోజ్ రెండో రౌండ్లో స్థానిక ఫేవరిట్ రాబర్ట్ చమసన్యన్ను ఓడించాడు. ప్రొఫెషనల్ బాక్సర్గా అవతారం ఎత్తిన తర్వాత, లైట్ వెల్టర్వెయిట్ (64 కిలోలు) నుంచి వెల్టర్వెయిట్ (69 కిలోలు) విభాగానికి మారిన మనోజ్ క్వార్టర్స్లో మెర్వెన్ క్లెయిర్తో తలపడతాడు. కాగా, 49 కిలోల విభాగంలో థామస్ మెరిటెయ్ మయెన్బమ్ను ఓడించిన అమిత్ ఫంగల్ కూడా క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. తర్వాతి ఫైట్లో అతను కజకిస్థాన్కు చెందిన ఎర్జాన్ జొమార్ట్ను ఢీ కొంటాడు. అయితే, సతీష్ కుమార్ (+91 కిలోలు), మనీష్ పవార్ (81) తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించారు.