క్రీడాభూమి
టి-20 వరల్డ్ కప్ టోర్నీకి 5న టీమిండియా ఎంపిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి: బంగ్లాదేశ్లో జరిగే ఆసియా కప్తోపాటు స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే టీమిండియాను సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఈనెల 5వ తేదీన ఎంపిక చేస్తుంది. ఢిల్లీలో జరిగే సమావేశంలో సెలక్టర్లు సమావేశమై, ఆటగాళ్లను ఎంపిక చేస్తారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్లోగా శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్ల టి-20 సిరీస్ను స్వదేశంలో ఆడుతుంది. అనంతరం ఆసియా కప్ టి-20 చాంపియన్షిప్లో పాల్గొంటుంది. ఈనెల 24 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకూ ఆసియా కప్ చాంపియన్షిప్ బంగ్లాదేశ్లో జరుగుతుంది. గతంలో ఈ టోర్నీని 50 ఓవర్ల ఫార్మెట్లో నిర్వహించేవారు. టి-20 ఫార్మెట్గా మార్చిన తర్వాత మొదటిసారి ఈ పోటీలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా మీర్పూర్లో జరిగే తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను భారత్ ఢీ కొంటుంది. 27వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడతుంది. మార్చి 1న శ్రీలంకను ఎదుర్కొంటుంది. మార్చి 3న క్వాలిఫయర్ జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఇలావుంటే, ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఈ టోర్నీలో మిగిలివున్న ఒక స్థానాన్ని భర్తీ చేసేందుకు క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా, టి-20 ప్రపంచ కప్ వచ్చేనెల 8వ తేదీ నుంచి మొదలవుతుంది.
chitram...
వీరిలో టి-20 వరల్డ్ కప్ ఆడేది ఎవరో?