క్రీడాభూమి

డేవిస్ కప్ జట్టులో పేస్ స్థానం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: డేవిస్ కప్ ఆసియా/ఓషియానియా గ్రూప్-1 రెండో రౌండ్‌లో వచ్చే నెల ఉజ్బెకిస్తాన్‌తో తలపడనున్న భారత టెన్నిస్ జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ స్థానాన్ని పదిలంగా ఉంచారు. మొత్తం ఆరుగురు సభ్యులతో సోమవారం ఎంపిక చేసిన ఈ జట్టులో లియాండర్ పేస్‌తో పాటు భారత నెంబర్ వన్ డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్నకు, సింగిల్స్ ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, ఎన్.శ్రీరామ్ బాలాజీలకు సెలెక్షన్ కమిటీ చోటు కల్పించిందని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) ప్రధాన కార్యదర్శి హిరణ్మయి చటర్జీ వెల్లడించారు. అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి బెంగళూరులో ఉజ్బెకిస్తాన్‌పై తలపడే నలుగురు సభ్యుల భారత తుది జట్టులో ఎవరెవరు ఉంచాలన్న దానిపై నిర్ణయాన్ని కొత్త నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతికి వదిలేసినట్లు ఆయన తెలిపారు.