క్రీడాభూమి

ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 7: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమైంది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మంగళవారం బెంగళూరులో ముగిసిన రెండో మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విరాట్ కోహ్లీ సేన ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ర్యాంకింగ్స్‌కు కటాఫ్ తేదీగా ఉన్న ఏప్రిల్ 1 నాటికి మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని 10 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతిని అందుకోనుందని ఐసిసి ధ్రువీకరించింది.

చిత్రం..కెప్టెన్ కోహ్లీ
విజయోత్సాహం